మహబూబ్ నగర్ లో ఘోర విషాదం జరిగింది…!!!
మహబూబ్ నగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. కోయిలకొండ మండలంలోని బూర్గుపల్లికి చెందిన అన్నదమ్ములను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. 44 ఏళ్ల మొగులయ్య, తన తమ్ముడు 32 ఏళ్ల లక్ష్మయ్య పొలం పనులను ముగించుకొని సాయంత్రం బైక్ పై బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్పారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. జరిగిన ఘటన పై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
