వివేకానంద స్మారకం వద్ద ధ్యానం చేస్తున్న ప్రధాని…
రెండు నెలల భీకర ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం కన్యాకుమారిలోని వివేకానంద రాక్లో 45 గంటల ధ్యానంలోకి వెళ్లారు. నారింజ రంగు దుస్తులు ధరించిన ప్రధాని మోదీ స్వామి వివేకానంద విగ్రహం ముందు ధ్యానం చేస్తున్నారు. జూన్ 1 మధ్యాహ్నం వరకు ప్రధాని మోదీ ధ్యానం చేయనున్నట్లులు తెలిపారు. 1892లో స్వామి వివేకానంద మూడు రోజుల పాటు ధ్యానం చేసిన ప్రదేశం ఇది. ఈ శిలలో శ్రీపాద మండపం అనే ప్రత్యేక హాలు […]

