WhatsApp Image 2024-01-29 at 7.54.40 AM Exclusive

అవినీతిని రూపుమాపితేనే నవసమాజం… -కంచర్ల సురేష్‌-

దేశానికి వెన్నెముకైన రైతులకు చట్టపరమైన పథకాలు అందే విధంగా, మహిళలు, బాలికలపై జరుగుతున్న అకృత్యాలను ప్రాలద్రోలే విధంగా సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ కృషి చేస్తుందనీ ఆ సంస్థ ఫౌండర్ చైర్మన్ కంచర్ల సురేష్ అన్నారు. కాకినాడ కొండయ్య పాలెంలో నిర్వహించిన జాతీయస్థాయి కార్యవర్గ సమావేశానికీ ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సమాచార హక్కు చట్టం -2005 పై అవగాహన సదస్సులు పలు రాష్ట్రాల్లో ఏర్పాటు […]

WhatsApp Image 2024-01-28 at 7.07.42 PM Kakinada

ధర్నా చౌక్ పై సత్వర నిర్ణయం తీసుకోవాలి… -బీ.జే.పీ. డిమాండ్-

ధర్నా చౌక్ పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని లేదా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు అనుమతించాలని కోరుతూ దుసర్లపూడి రమణ రాజు గత మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. దానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, మీడియా ప్యానలిస్ట్ దువ్వూరి సుబ్రహ్మణ్యం ఆయనకు మద్దతు తెలియజేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు గతంలో రాజకీయ పార్టీలు ధర్నాలు నిర్వహించి కలెక్టర్ లేదా జే.సీ. వంటి […]

WhatsApp Image 2024-01-28 at 8.44.00 PM Crime

హరి హర క్షేత్రం లో దొంగల బీభాత్సం….

సామర్లకోట పట్టణంలోని అయిదు తూముల వద్దగల రైల్వే ట్రాక్ గోదావరి కాలువ వద్ద హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన అన్నపూర్ణ సమేత రామ లింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి దొంగలు బీభాత్సం సృష్టించారు. నలుగురు వ్యక్తులు ఆలయంలో ప్రవేశించి ప్రధానాలయం తాళాలు పగులగొట్టి అన్నపూర్ణ అమ్మవారి ఆలయంలో వెళ్లారు. అమ్మవారికి నకిలీ నగలు ధరించడంతో అవి నకిలీవని వదిలిపెట్టి వెళ్లారు. అనంతరం హుండీలను బయటకు తెచ్చి వాటిని పగులగొట్టారు. అయితే ఇటీవలే హుండీలు ఖాళీ చెయ్యడంతో […]

WhatsApp Image 2024-01-28 at 3.23.04 PM Viral

కార్మిక వర్గ పోరాటాల్లో లెనినిజం ఉంది… -మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ-

ప్రపంచంలో నేడు జరుగుతున్న కార్మిక వర్గ పోరాటాల్లో లెనినిజం ఉందని మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్. శర్మ తెలిపారు. కాకినాడ యు.టి.ఎఫ్. హోం లో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో లెనినిజం విశిష్టత – అక్టోబర్ విప్లవం – భారతదేశం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సత్తిరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో ఎం.వి.ఎస్. శర్మ ముఖ్యవక్తగా ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రపంచ విముక్తి […]

WhatsApp Image 2024-01-28 at 5.24.30 PM Political

సార్వత్రిక ఎన్నికలపై బీ.జే.పీ. దృష్టి…

ఏ.పీ. లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్య భారతీయ జనతా పార్టీ ” పల్లెకు పోదాం” పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. బీ.జే.పీ. జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పిలుపు మేరకు బీ.జే.పీ. జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలోని 385 గ్రామపంచాయతీలు 412 గ్రామాలు 21 మండలాల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహణ గురించి విస్తృతంగా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జిగా […]

WhatsApp Image 2024-01-28 at 6.52.07 PM Kakinada

పీ.ఎం.పీ. లు ఫిబ్రవరి 4న విజయవాడ తరలి రావాలి…

ఫిబ్రవరి 4వ తేదీన విజయవాడలో జరిగే గ్రామీణ వైద్యుల రాష్ట్ర మహాసభ, ప్రపంచ కాన్సర్ దినోత్సవం వేడుకను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కాన్సర్ పై అవగాహన సదస్సు కు పీ.ఎం.పీ. లందరూ హాజరు కావాలని కమ్యూనిటీ పారామెడిక్స్, ప్రైమరీ హైల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమళ్ళ రాంబాబు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, తదితరులు అన్నారు. ఆదివారం కాకినాడ లక్ష్మీ హాస్పిటల్ ఆవరణలో అసోసియేషన్ కాకినాడ అధ్యక్షులు సీ.హెచ్. ఏడుకొండలు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం, […]

WhatsApp Image 2024-01-28 at 1.35.47 PM Trending News

‘జమునా’ నగర్‌…

తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సమక్షములో మాజీ ఎంపి, చిత్రరంగ సీనియర్ కథానాయిక జమున ప్రథమ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం, మాధవపట్నం చేరువులో ఉన్న జమున నగర్ లో సంఘ అధ్యక్షుడు తోట సత్తిబాబు అధ్వర్యంలో జమునకి నివాళులు అర్పించారు.

1000012705 Political

టిడిపి కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం…

కాకినాడ జిల్లా కాకినాడ అర్బన్ లో పాత బస్ స్టాండ్ పరిధిలో ఉన్న తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో బాబు కి శూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ మాజీ ఎం.ఎల్. ఏ. వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన్ని తెలుగు దేశం పార్టీ ప్రజలు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాబు కి శూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పై అవగాహన కల్పించారు. […]

WhatsApp Image 2024-01-28 at 10.01.22 AM Kakinada

కాకినాడలో ప్రైవేటు స్థలానికి టీడీఆర్‌ బాండ్లు జారీ…

కార్పొరేషన్ సొమ్మును వక్ర మార్గాలలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోచుకుంటున్నాడని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర రావు (కొండబాబు) ఆరోపించారు. టిడిఆర్ బాండ్ల పేరుతో కార్పొరేషన్ సొమ్ము 251 కోట్ల కుంభకోణానికి తెరలేపాడన్నారు.

WhatsApp Image 2024-01-27 at 5.38.15 PM Viral

సామర్లకోటలో ఘోర రోడ్డు ప్రమాదం…

కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట-కాకినాడ రోడ్డు రైల్వే గేట్ సమీపాన ఆదిత్య కళాశాల బస్సు కారుని వెనుక నుండి వేగంగా ఢీ కొట్టింది. దానితో ఆ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి పడిపోయింది. ఆ ప్రమాదంలో కారులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఆ ప్రమాదంతో ప్రయానికులందరూ ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.