కాకినాడ జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమం…
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిజం గెలవాలి కార్యక్రమాన్ని ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో తుని, జగ్గంపేట,పెద్దాపురం, కాకినాడ రూరల్ లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పర్యటిస్తారని వెళ్లడించారు. ఈ సందర్బంగా ఆయనను అక్రమ అరెస్టు చేసి నిర్భంధించిన సమయంలో వేదనకు గురై అసువులు బాసిన కుటుంబాలను నారా భువనేశ్వరీ పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించనున్నారని తెలిపారు.


