అబుదాబిలో ఆ ఆలయ ప్రారంభోత్సవంలో అక్షయ్ కుమార్…
అబుదాబిలో నిర్మించిన మొదటి హిందూ రాతి ఆలయ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ వేడుకలో పాల్గొనడం తనకు ఆశీర్వాదం అని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన బాప్స్ హిందూ మందిర్ శాస్త్రీయ సాంకేతికతలతో కూడిన పురాతన నిర్మాణ పద్ధతులను ఉపయోగించి నిర్మించారని అన్నారు. అబుదాబిలో బాప్స్ స్వామినారాయణ ఆలయ ప్రారంభోత్సవంలో భాగమైనందుకు ఆశీర్వదించబడ్డానన్నారు. తనకు ఎంతో చారిత్రాత్మకమైన క్షణమని అన్నారు. ఈ ప్రారంభోత్సవంలో నటులు […]
