అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద అటువైపు వెళ్తున్నఒక కారును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా ఒకరికి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.


