పౌరసత్వ సదస్సుకు ఆహ్వాన పత్రికలు ఆవిష్కరణ…
లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామిక వాదులు అనునిత్యం అప్రమత్తంగా వుండాలని పరిరక్షణ వేదిక అధ్యక్షులు అయితాబత్తుల రామేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఇంద్రపాలెం రాజగృహ మందిరంలో వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ… మార్చి30 శనివారం ఉదయం 10 గంటలకు కాకినాడ సిటీ కచేరీపేట యు టి ఎఫ్ మీటింగ్ హాలులో విస్తృత సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. ఆహ్వాన పత్రికలను వేదిక బృందం ఆవిష్కరిం చింది. […]









