WhatsApp Image 2023-11-06 at 9.21.48 PM Political

సామాజిక న్యాయం వై.యస్.ఆర్. కాంగ్రెసు పార్టీ తోనే సాధ్యం…

సామాజిక న్యాయం లక్ష్యంగా రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం పని చేస్తోందని డిప్యూటీ సీ.ఎం. బూడి ముత్యాల నాయుడు అన్నారు. 2024లో జగన్ అవసరం ఎంతైనా ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు,ఉన్నత కులాలలో ఆర్ధికంగా వెనుక బడిన వారికి తెలియజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సాధికార బస్సు యాత్రను రాష్ట్రంలోని నిర్వహిస్తునట్లు ఆయన చెప్పారు. సామాజిక సాధికార బస్సు యాత్ర సభ కాకినాడ రూరల్లోని సర్పవరం సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాల నాయుడు, మంత్రులు విశ్వరూప్, వేణు […]

IMG-20231031-WA0017 Political

విజయసాయి రెడ్డి క్షమాపణ చెప్పాలి… – బీజేపీ మహిళా మోర్చా డిమాండ్-

రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై జరుగుతున్న అక్రమాలను ఎత్తి చూపినందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎం.పీ. విజయ సాయి రెడ్డి క్షమాపణ చెప్పాలని బీజేపీ మహిళా మోర్చా డిమాండ్ చేసింది. ” పురందేశ్వరి మద్యం సేవిస్తారేమో నాకు తెలియదు – కానీ నేను మద్యం సేవించను” అని అవమానకరంగా మాట్లాడటం సిగ్గు చేటని మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న దుయ్యబట్టారు. మహిళల పట్ల వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ […]

IMG-20231031-WA0009 Political

ఇసుకలో 2000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కు… -బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి-

ఇసుక విషయంలో పాలకులు ఏవిధంగా జేబులు నింపుకుంటున్నారన్న విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీడియకు వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఇసుక వ్యవహారాన్ని లేవనెత్తి గణాంకాలతో సహా ఛాయా చిత్రాలను ప్రదర్శిస్తూ ఇసుక వ్యవహరంలో నైనా ప్రభుత్వం సమాధానం చెబుతుందా అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అనంతమైన సహజవనరులు ఉన్న రత్నగర్భ , నదీ నదాలు ఓడరేవులు సువిశాలమైన సముద్రతీర ప్రాంతం ఉన్న రాష్ట్రమన్నారు. భవన నిర్మాణానికి కావలసిన ఇసుక […]

WhatsApp Image 2023-10-26 at 7.23.55 PM Education / Career

జన విజ్ఙాన వేదిక చెకుముకి సైన్స్ సంబరాలను జయప్రదం చేయండి… -కాకినాడ ఆర్.జె.డి. జి. నాగమణి-

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు గత 32 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తుంది. 2023 చెకుముకి సైన్స్ సంబరాల గోడపత్రికను కాకినాడ ఆర్.జె.డి. శ్రీమతి జి. నాగమణి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అన్ని పాఠశాలలు ఈ సైన్స్ సంబరాలు జయప్రదం కావడానికి సహకరించాలని, తద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుటకు సహకరించాలని కోరారు. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ… ఈ పరీక్ష జూనియర్ (6, 7 తరగతులకు), సీనియర్స్ […]

WhatsApp Image 2023-10-25 at 7.03.13 PM Andhra Pradesh

దీపావళి పండుగకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి… జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా

రానున్న దీపావళి పండుగను సురక్షితమైన వాతావరణంలో జరుపుకునేలా ప్రమాదాలకు తావులేని పటిష్టమైన ఏర్పాట్లు, జాగ్రత్తలతో బాణాసంచా విక్రయాలను అనుమతించాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను కోరారు. కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్. సతీష్ కుమార్ సంయుక్తంగా వివిధ శాఖల అధికారులతో రానున్న నవంబరు 12వ తేదీన జరుపుకోనున్న దీపావళి పండుగ ఏర్పాట్ల పర్యవేక్షణపై ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… […]

WhatsApp Image 2023-10-25 at 1.23.02 PM Andhra Pradesh

ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఏలూరు రేంజ్ డీ.ఐ.జీ.

కాకినాడ జిల్లా పెద్దాపురం పోలీస్ స్టేషన్ ను ఏలూరు రేంజ్ డీ.ఐ.జీ. అశోక్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. పెద్దాపురం పోలీస్ స్టేషన్ నుండి రాష్ట్ర డి.జి.పి. తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్టేషన్ వద్ద కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, పెద్దాపురం డి.ఎస్.పీ. లతా కుమారి సీ.ఐ రవికుమార్, సామర్లకోట సీ.ఐ దుర్గాప్రసాద్, పెద్దాపురం ఎస్ఐ. .సురేష్, సామర్లకోట ట్రాఫిక్ ఎస్.ఐ గంగారావు ఘన స్వాగతం పలికారు. పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.  

WhatsApp Image 2023-10-23 at 6.17.10 PM Political

సమాజంలో ప్రధమ వైద్యుడు పారిశుధ్య కార్మికుడే… మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

సమాజంలో ప్రధమ వైద్యుడు పారిశుధ్య కార్మికుడని, వీరి సేవలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా సమాజంలో ఆరోగ్య సేవలు సాధించవచ్చునని మంత్రివ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. రామచంద్రపురం నియోజవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా పారిశుద్ధ్య కార్మికుల సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. రామచంద్రపురం పురపాలక సంఘం పరిధిలోని లైన్స్ క్లబ్ లో పారిశుధ్య కార్మికుల అభినందన సభలో బీ.సీ. సంక్షేమ సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు మాట్లాడారు. రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం అర్బన్, […]

1000039995 News

8000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్క్‌

 రాష్ట్రంలోని పోర్టుల అనుసందానంలో భాగంగా 8000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకు సంబంధించిన భూ సేకరణ చేపట్టింది. రామాయపట్నం పోర్టు తొలిదశను 2023 డిసెంబరు నాటికి పూర్తిచేయాలనే సంకల్పంతో పనులు జోరందుకున్నాయి. జూన్‌ 2022 లో నవయుగ, అరబిందో కంపెనీలు రూ.2,634.65 కోట్లతో రామాయపట్నం పోర్టు తొలిదశ నిర్మాణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. వాస్తవానికి రూ.3,736 కోట్ల వ్యయంతో 850.79 ఎకరాల విస్తీర్ణంలో 34.04 టన్నుల సామర్థ్యం […]

WhatsApp Image 2023-10-19 at 5.34.09 PM Andhra Pradesh

పారిశుద్ధ్య నిర్వహణపై కమిషనర్ అసహనం…. శానిటరీ ఇన్స్పెక్టర్, సెక్రటరీలకు షోకాజ్ నోటీస్, ఇద్దరు కార్మికుల సస్పెన్షన్

పారిశుద్ధ్య నిర్వహణలో సిబ్బంది అలసత్వం పై కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన ఒకటవ సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఎం. ప్రసాద్, శానిటరీ సెక్రటరీ జగన్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరో ఇద్దరు కార్మికులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. బాహ్య పర్యటనలో భాగంగా కమిషనర్ నాగ నరసింహారావు ఒకటవ సర్కిల్ పరిధిలోని ఆర్టీవో జంక్షన్ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. […]

WhatsApp Image 2023-10-19 at 2.51.38 PM Political

మహిళల ఆర్ధిక స్వావలంభనకు కుట్టు శిక్షణ దోహదం….

పేద, మధ్య తరగతి మహిళల ఆర్థిక స్వావలంబనకు కుట్టు శిక్షణ ఒక సాధనంగా దోహదపడుతుందని లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ మోటూరి మంగతాయారు పేర్కొన్నారు. స్థానిక మహిళ రీక్రియేషన్ క్లబ్ ఆవరణలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు, నలుగురు మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మహిళలకు కుట్టు శిక్షణలో మరియు ముగ్గుల పోటీ లో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ […]