WhatsApp Image 2023-10-30 at 8.23.11 PM Political

హోంమంత్రి ఎన్నికల ప్రచార రథం సిద్ధం…

2024 లో జరగనున్న ఎన్నికలకు రాష్ట్ర హోమ్‌ మంత్రి తానేటి వనిత ఎన్నికల ప్రచార రధాన్ని సిద్దం చేశారు. విషేశంగా ఆకట్టుకుంటున్న ఈ రధాన్ని చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. తొలిరోజైన సోమవారం ఈ రధానికి చాగల్లు గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం 3వార్డులో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మరోసారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకోవాలన్నారు.

WhatsApp Image 2023-10-30 at 8.34.18 PM Crime

నేరాల అదుపులో భాగస్వాములు కండి…. -అవగాహన సదస్సులో డి.ఎస్.పీ.-

సామర్లకోట పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల అదుపునకు గానూ వ్యాపారులు, ప్రజలు వారి వ్యాపార స్యలాల్లో, గృహాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాల సంఖ్యను తగ్గించేందుకు ప్రజలు, వ్యాపారులు పూర్తిగా భాగస్వాములు కావాలని పెద్దాపురం డిఎస్పి లతా కుమారి అన్నారు. సామర్లకోట పట్టణ పరిధిలోని వ్యాపారులు, పలు సంఘాల నాయకులకు సీసీ కెమెరాల ఆవశ్యకత తెలిపేందురు కార్యక్రమాన్ని నిర్వహించారు. సీ.సీ.ఎస్.ఐ. అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్దాపురం డీ.ఎస్.పీ.  లతాకుమారి ముఖ్యఅతిథిగా విచ్చేసారు. […]

IMG-20231030-WA0010 Education / Career

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మారై స్కానింగ్ ఏర్పాటు చేయాలి… – సి.ఎస్.ఆర్.ఎం.ఓ. కు వాసంశెట్టి వినతి-

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల నిమిత్తం అధిక శాతంలో పేదలు హాజరవుతారని అక్కడ అవసరమైన ఎమ్మారై స్కానింగ్ తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీ.సీ. ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు ఆసుపత్రి సి.ఎస్.ఆర్.ఎం.ఓ. పుష్కరరావుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి మాట్లాడుతూ… కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వందలాదిమంది రోగులు వివిధ వైద్య సేవల నిమిత్తం వస్తుంటారని అక్కడ అవసరమైన ఎమ్మారై స్కానింగ్ మూడున్నర సంవత్సరాల […]

IMG-20231030-WA0011 Political

మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి….

ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఏ.ఐ.టీ.యూ.సీ. అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని పిఠాపురంలో ఉదయం స్థానిక సూర్య రాయ విజ్ఞానంద గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం సాక రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, పార్టీ కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ హాజరయ్యారు. తోకల ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు సుమారు రెండు లక్షల పైగా ఉన్నారని […]

IMG_20231030_161302 Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ప్రారంభించారు. భానుగుడి పోలీసు కన్వెన్షన్ సెంటర్ లో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో పోలీసు సిబ్బందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బంది వారి కుటుంబసభ్యులు , మహిళా పోలీసులకు బీపీ, డయాబెటిక్, కార్డియాలజీ, గైనెకాలజీ సంబంధిత పరీక్షలను మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ల బృందం పర్యవేక్షణలో […]

50 రోజులు గడచినా నిరూపించలేకపోయారు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరశిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని ఈ నిరశన చేపట్టారు. రాష్ట్రంలో న్యాయం అన్యాయమవుతుందని, ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడిని 50 రోజులుగా జైల్లో పెట్టడం రాష్ట్ర దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. రాష్ట్రంలో న్యాయం గెలవాలని, చంద్రబాబు మరలా ముఖ్యమంత్రిని చేయటం ద్వారా ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని ఆయన […]

విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొని 12 మంది మృతి

విజయనగరం జిల్లాకొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 12 మంది మృతిచెందిగా 50 మంది చికిత్స పొందుతున్నట్టు అదికారులు వెల్లడించారు. గుంటూరు – రాయగడ ఎక్స్‌ప్రెస్‌, పలాస – విశాఖ డిఎంయు రైలు ఢీకొనగా నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ పరిణామంతో ప్రయాణీకులు ఆర్తనాదాలు హాహాకారాలతో పరుగుతు తీశారు. రైల్వే, పోలీస్‌ అధికారులు హుఠాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలు రంగంలోనికి దిగాయి. బాదితులు, క్షతగాత్రుల సమాచారం కోసం […]

IMG-20231029-WA0012 Political

జగనాసురుడికి కళ్లు తెరిపిద్దాం…… -సుంకర పావని-

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని అరెస్టు చేసీ 52 రోజులు గా అక్రమంగా జైలులో నిర్బందించినందుకు నిరసనగా “జగనాసురుడికి కళ్లు తెరిపిద్దాం” అనే కార్యక్రమము లో భాగంగా EX మేయర్ & కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ ఆధ్వర్యంలో కళ్ళకు గంతలు కట్టుకొని అరాచ‌క, విధ్వంస‌క పాల‌న సాగిస్తున్న సైకో జ‌గ‌నాసురుడి పీడ పోవాల‌నీ, “నిజం గెలవాలని” నినాదాలు చేస్తు నిరసన […]

వైఎస్‌ఆర్‌సీపీ పాలనకు చమరగీతమే ఉమ్మడి కార్యాచరణప్రదాన ఎజెండా

వైఎస్‌ఆర్‌సీపీ పాలనకు చమరగీతమే తెలుగుదేశం – జనసేన పార్టీల ఉమ్మడి కార్యాచరణే ప్రధాన ఎజెండా అని ఆ పార్టీల సమన్వయ కర్త మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కాకినాడ సాంబమూర్తినగర్‌లోని విఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్లో ఆదివారం రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇరుపార్టీల జిల్లా నాయకులు హాజరయ్యారు. సమావేశానంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ అనేక కుట్రలు చేస్తోందని, సమన్వయాన్ని విడగొట్టాలని కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. […]

కేరళలో వరుస బాంబు పేలుళ్లు

కేరళ కాలామస్సేరిలో భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినగా 36 మంది తీవ్రగాయాలపాలయ్యారు. కొచ్చిలోని ఓ క్రిష్టియన్‌ కన్వెన్షన్‌ హాల్లో మూడు వరుస పేలుళ్లు జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. గత మూడు రోజులుగా అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆదివారం చివరి రోజు కాగా ఈ ఘటనతో కేరళ అట్టుడికింది. అయితే ఈ సంఘటనపై ఎన్‌ఐఎ విచారణ చేపట్టింది. ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ పేలుళ్లకు పాల్పడ్డారు. ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడి […]