OIP (8) Education / Career

బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలలో ప్రతిభ చూపిన కరప విద్యార్థినులు…

కాకినాడ లో జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో కరప కు చెందిన హై స్కూల్ విద్యార్థినులు తన ప్రతిభను చాటారు. జిల్లా స్థాయిలో జరిగిన సైన్స్ కాంగ్రెస్ పోటీలలో కరప విద్యార్థినులు రూపొందించిన మానసిక పిల్లలు పుట్టుక కారణాలు, పరిష్కారం అనే ప్రాజెక్ట్ ఉత్తమంగా ఎంపికయ్యింది. జిల్లా వ్యాప్తంగా 260 ప్రాజెక్ట్ లు ప్రదర్శించగా రాష్ట్ర స్థాయికి ఏడూ మాత్రమే ఎంపిక కాగా అందులో కరప విద్యార్థినులు రూపొందించిన ప్రాజెక్ట్ […]

WhatsApp Image 2023-11-14 at 6.44.36 PM Movies

ఫ్యాక్షనిస్టుల్లో మార్పు తీసుకు వచ్చే పులివెందులపులిబిడ్డ సినిమా పోస్టర్ ఆవిష్కరించిన ఎం.పీ. మార్గాని భరత్…

ఒక ప్రేమ జంట ఫ్యాక్షనిస్టుల్లో ఏవిధంగా మార్పుతీసుకు వచ్చారనే అంశాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా లవ్, యాక్షన్ సన్నివేశాలతో వినోదాత్మకంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ రీతిలో తెరకెక్కించిన “పులివెందుల పులిబిడ్డ” చిత్రానికి సంబంధించిన ప్రచార పోస్టరును రాజమండ్రి ఎం.పీ. మార్గాని భరత్ రామ్ ఆవిష్కరించారు. ఎం.పీ. నివాసం వద్ద జరిగిన పోస్టరు ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాత, దర్శకుడు పేర్నపాటి విష్ణు, హీరో ప్రహ్లాద్, హీరోయిన్ ఐశ్వర్య గోల్డ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎం.పీ. […]

OIP (7) Kakinada

రోడ్డు ప్రమాదాల నివారణకు యాక్షన్ టీంలు ఏర్పాటు చేయ్యాలి… -జిల్లా ఎస్పీ-

జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికెట్టి, యువతను ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక యాక్షన్ టీంలు ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించాలని జిల్లా ఎస్పీ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీనిలో భాగంగానే ఆయా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రమాదాలు జరగకుండా తల్లిదండ్రుల సైతం కుటుంబాల్లో యువతను హెచ్చరిస్తూ వారిని క్రమబద్ధీకరించడం ద్వారా తోడ్పాటును అందించాలన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబు, నాయకులు నేతల శ్రీనివాసరావు పాల్గొన్నారు. వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబుమాట్లాడుతూ… బలుసులపేట పరిధిలో ఉన్న యువత సరైన […]

WhatsApp Image 2023-11-14 at 6.43.36 PM Kakinada

తల్లిదండ్రులే పిల్లలను అదుపు చెయ్యాలి… -మైత్రీ సంభాషణా సదస్సులో సీ.ఐ. పిలుపు-

ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో అధికంగా యువకులు మాత్రమే మృతి చెందడం, కాళ్ళు, చేతులు పోగొట్టుకోవడం జరుగుతున్నందున వారిని ప్రమాదాల భారిన పడకుండా అదుపుచేసే విషయంలో తల్లిదండ్రులు భాధ్యత తీసుకోవాలని సామర్లకోట సీ.ఐ. కే. దుర్గా ప్రసాద్ పిలుపునిచ్చారు. సామర్లకోట బలుసుల పేటలో మైత్రీ సంభాషణా అవగాహనా సదస్సు సీ.ఐ. ఆధ్వర్యంలో నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీ.ఐ. మాట్లాడుతూ… స్థాయికి మించి పిల్లల ఆనందం కోసం మోటార్ సైకిల్లను, సెల్ఫోన్లను, ఇతర […]

WhatsApp Image 2023-11-14 at 6.42.58 PM Education / Career

సాంబమూర్తి పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు…

కాకినాడ రామారావుపేటలోని మహర్షి బులుసు సాంబమూర్తి జిల్లా ప్రజా పరిషత్ ఓరియంటల్ ఉన్నతపాఠశాలలో బాలల దినోత్సవవేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. సాయిబాబా ఆధ్వర్యంలో జరిగిన బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ (హెన్) ప్రాజెక్ట్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.ఎన్. మూర్తి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… పాఠశాలలో ప్రతి గురువారం తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. ఈ విధానం వలన […]

IMG-20231114-WA0006 Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన 14, 15 సర్కిల్స్ పరిధిలోని శాంతినగర్, కొత్త కాకినాడ ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదివారం, పండుగ సెలవుల నేపథ్యంలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆయన కోరారు. కొన్నిచోట్ల బాణాసంచా వ్యర్ధాలు, చెత్త పేరుకు పోవడానికి గుర్తించారు. వెంటనే వీటిని […]

IMG-20231114-WA0003 National

పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలను నిర్వహించినజిల్లా కలెక్టర్…

పండిట్ జవహర్లాల్ నెహ్రూ గొప్ప పాలనాదక్షుడు, దార్శనికుడు, రాజ నీతజ్ఞుడుగా స్వాతంత్య్రానంతరం తొలి ప్రధానమంత్రిగా భారత దేశ ప్రజాస్వామ్య, ఆర్థిక వ్యవస్థలకు గట్టి పునాదులు వేశారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ నందు పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలను బాలల దినో త్సవ వేడుకలను నెహ్రూ చిత్రప టానికి పూలమాలలు అలంకరించి పుష్పగుచ్చాలతో శ్రద్ధాంజలి ఘటి oచి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బ్రిటీష్ వారినుండి స్వాతంత్ర్యం పొందిన […]

IMG-20231114-WA0004 Kakinada

నెహ్రూ విగ్రహాన్ని టీ.టీ.డీ. సెంటర్ లో ప్రతిష్టించాలి…

స్వాతంత్ర్య సమరయోధులు 1964 లో నెలకొల్పిన భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విగ్రహాన్ని వారి స్మారక చిహ్నంగా బాలాజీ చెరువు సెంటర్ లో ప్రతిష్ట చేయాల్సిన బాధ్యత పౌర సమాజం పై వుందని సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజుపేర్కొన్నారు. నెహ్రూ134వ జయంతి సందర్భంగా బాలాజీ చెరువు (టీ.టీ.డీ.) సెంటర్ లో నెహ్రూ స్మారకఫ్లెక్సీ కి పూలదండలతో పుష్పాంజలి ఘటించారు. నెహ్రూ మరణానంతరం అప్పటి స్వాతంత్ర్య సమర యోధులు 1964లో నవంబర్ 14న బస్ట్ సైజు […]

TDP-Flag-Jenda-Janasena-Flag-Alliance-2024 Political

టీడీపీ, జనసేన మినీ మేనిఫెస్టోలో 12 అంశాలు చేర్పు… -యనమల రామకృష్ణుడు, ముత్తా శశిధర్-

టీడీపీ, జనసేన మినీ మేనిఫెస్టోలో 12 అంశాలు చేర్చినట్లు ఆ పార్టీ అధినేతిలు యనమల రామకృష్ణుడు, ముత్తా శశిధర్ తెలిపారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం మంగలగిరి లో టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఆ సమావేశానికి ముఖ్య అతిథులుగా యనమల రామకృష్ణుడు, ముత్తా శశిధర్ విచ్చాశారు. ఈ సందర్భంగా రామకృష్ణుడు మాట్లాడుతూ… గతంలో టీడీపీ తరుపున ఇచ్చిన మేనిఫెస్టో లో 6 అంశాలు ఉండేవని, జనసేన కొత్తగా మరో 6 అంశాలను చేర్చిందని ఆయన తెలిపారు.

OIP (6) Hyderabad

హైదరాబాద్ లో నాంపల్లి బజార్ షూట్ లోని బాలాజీ అపార్ట్మెంట్ కు అగ్నిప్రమాదం…

హైదరాబాద్ లో నాంపల్లి బజార్ షూట్ లోని బాలాజీ అపార్ట్మెంట్ అగ్నిప్రమాదానికి గురయ్యింది. అపార్ట్మెంట్ లో షార్ట్ సర్క్యూట్ అవ్వడం తో మంటలు ఎగసిపడ్డాయి. అక్కడ వెలువడ్డ రసాయనాల పొగ పీల్చడంతో ఇద్దరు చిన్నారులతో పాటు తొమ్మిది మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించడంతో బంధువులు కన్నీటి మునిగారు. కాగా అపార్ట్మెంట్ లో ఉంటున్న మరో 21 మందిని […]