WhatsApp Image 2023-11-22 at 8.18.37 PM Kakinada

ప్రమాదాలపై ఆటో డ్రైవర్ లకు అవగాహన…

విశాఖపట్నంలో విద్యార్థులు ప్రయాణిస్తున్న వాహనానికి జరిగిన ప్రమాద నేపద్యంలో సామర్లకోట పట్టణంలో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. సామర్లకోట పట్టణ పరిధిలోని స్టేషన్ సెంటర్లో ఉన్న మూడు ఆటో స్టాండుల వద్ద, మెహర్ కాంప్లెక్స్ సెంటర్ వద్ద పాఠశాల విద్యార్థుల కోసం నడుపుతున్న ఆటో డ్రైవర్లతో మాట్లాడి అవగాహన కల్పించారు. విశాఖపట్నంలో కేవలం ఒక ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అనేకమంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారన్నారు. వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు […]

IMG-20231122-WA0040(1) Political

గుంతల రోడ్డులో వరినాట్లు వేసి నిరశన…

పీ. గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది కార్యక్రమంలో నిరశన తెలియజేశారు. మండల తెలుగుదేశం – జనసేన పార్టీల ఉమ్మడి సమన్వయకర్త మద్దా చంటిబాబు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాస్ ఈ నిరశన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముక్తేశ్వరం నుండి కే జగన్నాధపురం వరకూ, అయినవిల్లి నుండి మడుపల్లి వరకూ ఆర్ అండ్ బి రోడ్డులోని గుంతలను పూడ్చి […]

రాజకీయం అంటే ఏంటో ముందు ముందు చూపిస్తా…!

– ఎమ్మెల్యే పొన్నాడకు యానాం మాజీ ఎమ్మెల్యే మల్లాడి వార్నింగ్ ఆంధ్రప్రదేశ్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ కుమార్‌కు రాజకీయం అంటే ఏమిటో ముందు ముందు చూపిస్తానంటూ యానాం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు మాస్‌వార్నింగ్‌ ఇచ్చారు. యానాంలో జరిగిన ఓ కార్యక్రమంలో మల్లాడి మాట్లాడుతూ తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న “బర్రెలక్క” అలియాస్‌ శిరిషా కు ఆర్థిక సహాయం ప్రకటించి వార్తల్లోకెక్కిన […]

Screenshot_20231122_175842 Crime

ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీ లో విద్యార్థుల మధ్య ఘర్షణ…

ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీ లో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కాలేజీ విద్యార్థులు వీది రౌడీల్లా కొట్టుకున్నారు. గతంలో విద్యార్థులు ఒకరిపై ఒకరు కాలేజీ సిబ్బందికి ఫిర్యాదులు చేసుకున్నారు. ఫిర్యాదు పై స్పందించిన కళాశాల సిబ్బంది, కొంతమంది విద్యార్థులపై చర్యలు తీసుకుంది. చర్యలు తీసుకోవడంతో విద్యార్థుల మధ్య వివాదం ముదిరింది. ఈ వివాదం నేపథ్యంలో రాత్రి ఇరువర్గాల మధ్య మరోసారి కొట్లాట జరిగింది. కళాశాలల సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు ఇరు వర్గాల విద్యార్థులను […]

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 23 నుండి ప్రారంభం కానుందని కమిషనర్, ఎక్స్ అఫీషియో సెక్రటరీ, సమాచార, పౌర సంబంధాల శాఖ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తూ అక్రిడిటేషన్ కలిగిన అర్హులైన జర్నలిస్టులకు హౌసింగ్ స్కీమ్ క్రింద ఇంటి స్థలాలను అందించేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 535 ద్వారా వీలు కల్పించిందన్నారు. అర్హులైన జర్నలిస్టులు ఇళ్ల స్థలాల మంజూరు కోసం తమ వివరాలను […]

WhatsApp Image 2023-11-21 at 12.42.56 PM (1) Crime

పేరు మోసిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు… -జిల్లా ఎస్.పీ కే.కే.ఎన్. అన్బురాజన్-

పేరు మోసిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్.పీ కే.కే.ఎన్. అన్బురాజన్ మీడియాకు తెలియచేశారు. వారినుంచి సుమారు రూ. 12 లక్షల రూపాయల విలువచేసే 23.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన అన్నారు.వీరిలో ఒక దొంగపై ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలో 50 కి పైగా కేసులు ఉన్నట్లు, మరో దొంగపై 10 కేసులు, మరో దొంగపై 03 కేసులు ఉన్నట్లు జిల్లా ఎస్.పీ కే.కే.ఎన్. అన్బురాజన్ అన్నారు.

WhatsApp Image 2023-11-21 at 11.43.24 AM Crime TECH

రూ.40 లక్షల విలువ చేసే 236 సెల్ ఫోన్లు స్వాదీనం

కాకినాడ జిల్లాలో  దొంగలించబడిన 236 సెల్ ఫోన్ లను రికవరీ చేసినట్లు జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎస్‌ సతీష్ కుమార్ వెల్లడించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దొంగలించబడిన సెల్ఫోన్ లను రికవరీ చేసి వాటి యజమానులకు అందించడం ఇది మూడోసారి అని ఆయన తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 236 సెల్ఫోన్లను పోలీస్ అధికారులు, సిబ్బంది రికవరీ చేసినట్లు ఎస్.పీ. సతీష్ కుమార్ వివరించారు.

WhatsApp Image 2023-11-21 at 11.07.35 AM Political

సీఎం తిరుపతి జిల్లా పర్యటన రద్దు…

భారీ వర్షం కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తిరుపతి జిల్లా పర్యటను రద్దు చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లోని మాంబట్టు వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. మత్యకార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఈ రోజు బహిరంగ సభలో పాల్గొని ఈ ప్రాంత మత్యకారుల అభివృద్ధి కోసం సుమారు 150 కోట్ల రూపాయలు తో కొన్ని ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి వుంది, […]

WhatsApp Image 2023-11-21 at 10.45.32 AM Kakinada

కాకినాడ తీరంలో తిరగబడ్డ ఫైబర్‌ బోటు

కాకినాడ జల్లా కాకినాడ సముద్ర తీరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సముద్రం లోకి చేపలు వేటకు వెళ్లిన మత్స్యకారులు ఫైబర్‌ బోటు బోల్తాపడింది. ఆ ప్రమాదంలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతు అయ్యారు. సూర్యరావు పేట నుండి హోప్ ఐలాండ్ వద్దకు ఐదుగురు మత్స్యకారులు వేటకు వెళ్ళారు. వేట ముగించుకుని తిరిగి వస్తుండగా కెరటాల దాటికి తెప్ప తిరగబడి ఇద్దరు గల్లంతయ్యారు. మిగిలిన ముగ్గురు సురక్షితంగా వొడ్డికి వచ్చారు. గల్లంతయిన వారిలో… దుమ్ముల పేటకు చెందిన మైలపిల్లి కృపదాసు,సూర్యరావు […]

డిసెంబర్‌ 8 నుంచి అంగన్‌వాడీ వర్కర్స్‌ నిరవదిక సమ్మె

అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా డిసెంబర్‌ 8 నుంచి నిరవదిక సమ్మెకు అంగన్‌వాడీ వర్కర్స్‌ సన్నద్దమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నికల హామీ అమలు చేయటంలో విఫలమయ్యారని యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబిరాణి తీవ్రంగా విమర్శించారు. కాకినాడ సిఐటియూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. అంగన్‌వాడీ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమవుతుందని ఆరోపించారు. నూతన […]