ఆకట్టుకున్న క్రియా పిల్లల కోలాటాల సందడి

కోలాటాల కోలాహలం, జానపద నృత్యాల సందడి, లఘు నాటకాల సందేశాలు, శాస్త్రీయ నృత్యాల సరిగమపదనిసలు, ఏకపాత్రాభినయాల అభినయాలు, విచిత్ర వేషధారణల….పిల్లల కేరింతలతో Kakinada JNTU ప్రాంగణం పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. క్రియ పిల్లల పండుగ రాష్ట్రస్థాయి అంతర్ పాఠశాలల సాంస్కృతిక పోటీలు అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో ప్రారంభమయ్యాయి. రెండు రోజులు పాటు సాగే క్రియ పిల్లల పండుగ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్ధినీ విద్యార్థులు సుమారు 10,000 […]

IMG_20231125_230115 Political

వై.సీ.పీ. ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు ఘోర అవమానాలు…

ఆర్యవైశ్య కుల ద్రోహిగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చరిత్రలో నిలిచిపోయాడని గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. వాసవీ సేవా సమితి, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం తలపెట్టిన వనభోజనాలకు అనుమతి లేదంటూ పోలీసులతో మంత్రి వెల్లంపల్లి అడ్డుకోవడం పై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ఈ పరిసర ప్రాంతాల్లోనే ప్రభుత్వం నిర్వహించిన వనభోజనాలకు లేని అనుమతులు ఆర్యవైశ్యులు జరుపుకునే వన సమారాధనలకు , పూజలకు […]

IMG-20231125-WA0013 Political

సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక పాలను అందిస్తోంది… -దెందులూరు ఎమ్మెల్యే చౌదరి-

సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకు పారదర్శకమైన సేవలు అందిస్తోందని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి పేర్కొన్నారు. అర్హతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలను అందిస్తున్నారని అన్నారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక 43వ డివిజన్‌ ప్రతాప్‌నగర్‌ ప్రాంతంలో జరిగిన సంక్షేమ పథకాల లబ్థిదారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడితో కలిసి నేరుగా ప్రజలవద్దకు వెళ్ళి ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని ఆరా తీసి స్పందనను తెలుసుకున్నారు. […]

IMG-20231125-WA0012 Exclusive

కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్…

సామర్లకోట మండలం హుస్సేన్పురం లో ఘోర ప్రమాదం జరిగింది. సామర్లకోట మండలం హుస్సేన్పురం సమీపంలో ఒక ట్రాక్టర్ అదుపు తప్పడంతో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. సామర్లకోట నుండి వేట్లపాలెం వెళుతున్న ట్రాక్టర్ అతివేగంగా వస్తున్న ఒక ఆటోను తప్పించే క్రమంలో అదుపుతప్పి గోదావరి కాలువలోకి దూసుకు వెళ్ళింది. అప్రమత్తమైన డ్రైవర్ ట్రాక్టర్ నుండి కాలువలోకి దూకడంతో ప్రమాదం తప్పింది. ఆటో ప్రయాణికులకు ఇటు డ్రైవర్ క్షేమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

IMG-20231125-WA0011 Kakinada

ఓటర్ జాబితాల పరిశీలన వేగవంతం చెయ్యండి… -ఆర్డీవో సీతారామారావు-

జనవరి 5వ తేదీన ఓటరు జాబితాల తుది ప్రకటన చేయనున్న క్రమంలో మున్సిపాలిటీ పరిధిలోని బూత్ లెవల్ అధికారులు, సూపర్ వైజర్లు ఇంటింటా ఓటరు జాబితాల పరిశీలన వేగవంతం చెయ్యాలని పెద్దాపురం ఆర్డీవో సీతా రామారావు ఆదేశించారు. సామర్లకోట మున్సిపాలిటీలో అందరు బి.ఎల్.వో. లు, సూపర్వైజర్ లకు ఓటర్ జాబితాల పరిశీలన పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కమిషనర్ జె. రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆర్డీవో మాట్లాడుతూ… తుది జాబితా తయారీకి గానూ ఇంటింటికీ […]

దోమ పోటు … జికా వైరస్ కాటు..!

జికా వైరస్ వ్యాప్తికి కారకమైన ఎడిస్ దోమ పట్ల అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరసింహ నాయక్ సూచించారు. ఆయన మీడియోతో మాట్లాడుతూ జికా వైరస్ పూర్తిస్థాయి నివారణ కు అవసరమైన ఔషధాలుగాని, ఇంజక్షన్లుగాని అందుబాటులో లేవన్నారు. కేవలం నివారణ చర్యలతో మాత్రమే అప్రమత్తంగా ఉండాలన్నారు. 2016 సంవత్సరంలో భారత దేశంలో ఈ వైరస్ ను గుర్తించడం జరిగిందని, ఆనాటి నుండి నేటి వరకు ఎక్కడా కూడా జికా వైరస్ వ్యాప్తి […]

జగన్‌కు బెయిల్ రద్దై జైలుకు పోయే రోజు దగ్గర్లోనే: ప్రత్తిపాటి

చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడం, బెయిల్ రద్దై జగన్ మళ్లీ జగన్‌ జైలు పోవడం ఖాయమని, ఆ రోజు దగ్గర్లోనే ఉందని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఒకవైపు స్కిల్‌ కేసులో చంద్రబాబుకు పూర్తిస్థాయి బెయిల్ రావడం, మరోవైపు యువగళం పునఃప్రారంభంతో వైకాపాలో వణుకు మొదలైందన్నారు ప్రత్తిపాటి. రాష్ట్రంలో వైకాపా రోజులు లెక్క బెట్టుకోవాల్సిందేనని, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ ఒకవైపు .. భువనేశ్వరి, లోకేశ్ మరోవైపు రాష్ట్రం మొత్తం పర్యటించబోతున్నారని, ఆ […]

మహిళల సాధికారతకు ప్రభుత్వ కృషి

మహిళల సాధికారతకు శ్రమించిన జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఉందని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత పేర్కొన్నారు. కాకినాడ 32వ డివిజన్, రామకృష్ణారావుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించి గడచిన నాలుగున్నర యేళ్ళ కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కుల మతాలకతీతంగా, రాజకీయాలకు సంబంధం లేకుండా […]

ఇంటింటికీ వైద్యం …. కాకినాడ జీజీహెచ్‌లో రద్దీ..!

రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించి ప్రాథమిక వైద్య కేంద్రాలు, 104, ఫ్యామిలీ ఫిజిషియన్ వంటి కార్యక్రమాలు ద్వారా గ్రామాల స్థాయిలో ఇంటింటికి వైద్యం అందించడం అందరికీ తెలిసిన విషయమే. తాజాగా జగనన్న సురక్ష పథకం ద్వారా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అధిక సంఖ్యలో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నాం అని ప్రజాప్రతినిధులు, అధికారులు బాహాటంగా చెబుతున్న నేపథ్యంలో ఒక చిక్కు […]

స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వలేదు… రైల్వే జోన్‌ లేదు

కేంద్ర ప్రభుత్వ విధానాలపై భారత కమ్యునిస్ట్‌ పార్టీ, ఇతర పార్టీల నాయకుల సమన్వయంతో శుక్రవారం నిరసన తెలియజేశారు. కాకినాడ టౌన్‌ రైల్లే స్టేషన్‌ సమీపంలో నినాదాలు చేస్తూ రైల్వే ప్రైవేటీకరణ విరమించుకోవలంటూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు జి బేబి రాణి, జిల్లా నాయకులు పలివెల వీరబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు దువ్వా శేషబాబ్జి, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, రాజ్‌కుమార్‌, ఐఎన్‌టీయూసీ నాయకులు రాజు, […]