WhatsApp Image 2023-12-21 at 8.56.24 PM Konaseema

ఆత్రేయపురంలో ఏ.పీ. కు జగనే ఎందుకు కావాలనే కార్యాక్రమం…

ఆంద్ర ప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలనే కార్యాక్రమాన్ని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో నిర్వహించారు. ఈ కార్యాక్రమాన్ని ఎం.పీ.డీ.ఓ. నాతిబుజ్జి, ఇ.ఓ. డి. శ్రీనివాసరావు నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో భాగంగా సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నాతిబుజ్జి మాట్లాడుతూ… ప్రజలకు అందుతున్న పథకాలపై అవగాహన కల్పించి, వచ్చే ఎన్నికల్లో జగన్ ని మల్లి గెలిపించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.డీ.ఓ. నాతిబుజ్జి, ఇ.ఓ. డి. శ్రీనివాసరావు, ఆప్కాస్ […]

WhatsApp Image 2023-12-21 at 8.04.49 PM (1) Exclusive

పిఠాపురంలో అంగన్ వాడీల నిరసన…

అంగన్వాడి వర్కర్ల సమస్యలపై పది రోజులగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి వర్కర్లు, కార్యకర్తలు నిరసన చేస్తున్నారు. అయినా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి చలనం కలగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా వారందరూ చెవిలో పువ్వులు పెట్టుకొని పిఠాపురం లోని ఎం.ఆర్.ఓ. కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఆంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు అంగన్వాడి వర్కర్లకు ఇచ్చిన హామీలను తక్షణనమే నెరవేర్చాలని తెలిపారు

j-4-700x500 Viral

రామమందిర కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలకు ఆహ్వానం…

జనవరి-22-2024 లో అయోధ్యలో జరిగే రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, సోనియా గాంధీ, లోక్‌సభలో పార్టీ నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌదరిలకు ఆహ్వానాలు ఇచ్చారు. వారికి ఆహ్వానాలు పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాని ఈ వేడుకకు కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యే అవకాశం లేదని వారు తెలిపారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్‌డి దేవెగౌడలకు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానాలు ఇచ్చినట్లు […]

OIP (4) Exclusive

ఏ.పీ. సీ.ఎం. కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీ.డీ.పీ అధినేత…

ఎస్. రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలువురు వై.ఎస్.ఆర్‌.సీ.పీ. నేతలు, పార్టీ మద్దతుదారులతో సహా తాడేపల్లిలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏ.పీ. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.  

30bdef4c-e6cc-41cb-a846-178c3e8daadb Exclusive

పోలవరం త్వరగా పూర్తి చేయాలి… -డా. మోహన్ లాల్-

ఏలూరు జిల్లాలో పోలవరం జాతీయ ప్రాజెక్టును రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్‌లాల్ పాటిల్ సందర్శించారు. అక్కడ స్థానికులతో ఆయన సమావేశమై వివరాలను తెలుసుకున్నారు. నాలుగేళ్లుగా ప్రాజెక్ట్ కు సంబందించి ఎటుంంటి నిర్మాణం చేపట్టలేదని, నిర్వాసితులకు కూడా ఎలాంటి న్యాయం జరగలేదని గమనించారు. ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించే ఈ జాతీయ ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పూర్తికావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడ ఏ […]

OIP (3) Exclusive

దళిత, గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి… -డి.వి.ఎమ్.సి సభ్యులు రాజు-

జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటి సమావేశం కర్నూల్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం నిర్వహించారు. దళిత, గిరిజన ప్రజల సమస్యలను పరిష్కరించాలి డి.వి.ఎమ్.సి సభ్యులు ఎరుకల రాజు కలెక్టర్ కు జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటి సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఎరుకల రాజు మాట్లాడుతూ… క్రిష్ణగిరి మండలం, ఎరుకలచెరువు గ్రామంలో దళితులు తరతరాలుగా వాడుకుంటున్న రచ్చకట్టను కులవివక్షతో కూల్చి, ఆక్రమించుకున్నారని తెలిపారు. ఆ స్థలంలో ఇల్లు నిర్మాణానికి పునాది తవ్విన వ్యక్తులపై స్థానిక అధికారులకు […]

WhatsApp Image 2023-12-21 at 1.28.58 PM Exclusive

బలభద్రపురంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు…

బలభద్రపురంలో అభివృద్ధి పనులు చేపట్టారు. వై.సీ.పీ. కన్వీనర్ నల్లమిల్లి వెంకట రెడ్డి, సర్పంచ్ బుంగా రామారావు నేతృత్వం లో అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నారు. ఈ వెంకట రెడ్డి సందర్బంగా మాట్లాడుతూ.. గంగాలమ్మ తల్లి సెంటర్ నుండి 2వ వార్డు సచివాలయం వరకు ఉన్న మామూలు డ్రైన్ లను సిమెంట్ డ్రైన్ గా నిర్మిస్తున్నామని చెప్పారు. పాత సంత మార్కెట్ వీధి నుండి రాజానగరం వెళ్లే రోడ్డు కి […]

chandrababu_pawan_lokesh11639377766 Political

టీడీపీ-జేఎస్పీ పొత్తుపై కార్యకర్తల నుంచి మిశ్రమ స్పందనలు…

టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌లు కలిసి వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నామని ప్రకటించిన తర్వాత మొదటిసారిగా బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండు పార్టీల మద్దతుదారులు సమావేశాన్ని నిర్వహించారు. నారా లోకేష్ యువ గళం పాదయాత్ర విజయవంతంగా జరిగింది. ప్రముఖ నేతలందరి ప్రసంగాలకు మంచి స్పందన లభించగా, జనసైనికులు తమ నాయకుడు ప్రసంగిస్తున్నప్పుడు వారి కాళ్లపై నిలబడ్డారు. అయితే టీడీపీ-జేఎస్పీ పొత్తుపై నేతలు, కార్యకర్తల నుంచి మిశ్రమ స్పందన […]

genone Exclusive

జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలి…

భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్యా నగర పాలక సంస్థ ఆరోగ్య మౌలిక సదుపాయాల సంసిద్ధతను పరిశీలిస్తోందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. భరద్వాజ్ మాట్లాడుతూ… ఇన్ఫెక్షన్ లను తగ్గంచడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, భయాందోళనలను నివారించడమే లక్ష్యంగా ఉందని తెలిపారు. దేశంలో కొత్తగా కనుగొనబడిన కోవిడ్ -19 వేరియంట్ గురించి ఆందోళనలన పడొద్దని చెప్పారు. వైరాలజీ, పల్మోనాలజీ, కమ్యూనిటీ హెల్త్‌ నిపుణులతో ఇటీవలి సంప్రదింపులను జరిపినట్టు చెప్పారు. ఏదైనా కొత్త […]