కేక్ మెమోరియల్ చర్చి నందు కార్నవల్ అట్టహాసంగా చర్చ్ ఆవరణలో వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసి జార్ఖండ్ రాష్ట్రంలోని మాల్టోవా పిల్లల ప్రాథమిక విద్యకు సహకరించే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ కార్నివెల్ జరుపుతున్నారని రంగరాయ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి.వి. ప్రసన్నకుమార్ తెలిపారు. ఈ కార్నివిల్లో మెడికల్ స్టాల్ ని కూడా ఏర్పాటు చేసి ఈ మెడికల్ స్టాల్ లో వైద్య శిబిరం లో వైద్య సేవలు అందించారని అన్నారు. అంతేకాకుండా పరీక్షలు చేసి వాటి ద్వారా వచ్చిన డబ్బులను మాల్టోవా ప్రజలకు విరాళంగా అందించాలని సంకల్పంతో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి.వి. ప్రసన్నకుమార్, డాక్టర్ కె. అనిల్ కుమార్. ల్యాబ్ అనలిస్ట్ కమ్యూనిటీ పారా మెడిక్ డి.ఎల్. రాజు, తదితురులు పాల్గొన్నారు.
కేక్ మెమోరియల్ చర్చి నందు వైద్య శిభిరం…
