కాకినాడ జిల్లా కాకినాడ నగరంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. పప్పులమిల్లు సెంటర్ సమీపంలో భార్యపైన అనుమానంతో తన భర్తే తనను కత్తిపీటతో మెడ నరికి అతి కిరాతకంగా చంపాడు. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న వన్ టౌన్ స్టేషన్ పోలీసులు మృతురాలిని విచారణకై పంపించారు. ఈ ఘాతకానికి పాల్పడిన భర్తను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాకినాడలో దారుణ ఘటన…
