కాకినాడ జిల్లా మండపేట నియోజకవర్గం లో తెలుగు జనతా పార్టీ ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించింది. ఈ ప్రజా యాత్ర కార్యక్రమానికి మండపేట ఎం.ఎల్.ఏ. అభ్యర్థి కోట వీర వెంకట నరసింహారావు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నకల్లో తెలుగు జనతా పార్టీని గెలిపించాలని కోరారు. 2024 ఎన్నికలకు మండపేట నియోజకవర్గం నుండి కోట వీర వెంకట నరసింహారావు ను తెలుగు జనతా పార్టీ అభ్యర్థి గా నిలబెట్టడం జరిగిందని అన్నారు. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వీర వెంకట నరసింహారావు, అనపర్తి మండలం శెట్టి బలిజ సంఘం ప్రెసిడెంట్ పిల్లి వెంకటరమణ, తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు, టీ.జె.పి. కార్యకర్తలు పాల్గొన్నారు.
మండపేటలో ఘనంగా తెలుగు జనతా పార్టీ ప్రజా చైతన్య యాత్ర…

