పరిపాలన వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్య స్థాపన కోసం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ముఖ్య మంత్రి స్థాపించాలని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ అన్నారు. ఉప్పలగుప్తం మండల పరిధిలో భీమనపల్లి గ్రామంలో నరేగా నిధులైన రూ. 23.94 లక్షల వ్యయంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆధ్వ ర్యంలో నిర్మించిన భీమనపల్లి రైతు భరోసా కేంద్రం-1 ను మంత్రి ప్రారంభించారు.
అదేవిధంగా 15 ఆర్థిక సంఘం నిధులైన రూ. 50 లక్షల వ్యయంతో అదే గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్మించనున్న బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తదుపరి జల జీవన్ మిషన్ నిధులైన రూ 30.60 లక్షల వ్యయంతో బీమనపల్లి సూదాపాలెం ఆవాసం నందు నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును ఆయన ప్రారంభించారు.
అదే గ్రామంలో నరేగా+ఆరోగ్య శాఖ నిధులైన రూ. 20.80 లక్షలతో నిర్మించిన వైయస్సార్ హెల్త్ క్లినిక్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గడ్డం సంపద రావు, ఎం.పీ.టీ.సీ. నాగరత్న కుమారి, సర్పంచ్ పి. రాజ్ కుమార్. బి. బాబ్జి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

