తెలుగుదేశ్-జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈరోజు ఉదయం 11.40 గంటలకు ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు-పవన్ కళ్యాణ్ జాబితాను విడుదల చేయనున్నారు. తొలి జాబితాలో టీడీపీ నుంచి 50, జనసేన నుంచి 15 పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు బీజేపీ పొత్తుపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఈ లోపు కొంతమంది అభ్యర్థులను ప్రకటించాలని ఇరుపక్షాలు నిర్ణయించినట్లు తెలుస్తుంది.
తొలి జాబితాలో టీడీపీ-50… జనసేన-15?

