కాకినాడ జిల్లాలోని కాకినాడ రూరల్ కరప మండలం సిరిపురం గ్రామంలో శ్రీ గోగులమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాలను పున నిర్మాణం అనంతరం జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రముఖ వ్యాపార వేత్తలు జనసేన పార్టీ నాయకులు చిక్కాల దొరబాబు, చిక్కాల సుబ్రహ్మణ్యేశ్వర రావు సోదరులు గత ఆరు సంవత్సరాల నుండి సుమారు పదివేల మంది కి పైగా పరిసర గ్రామాల నుంచి తరలి వచ్చే మహిళలకు ఆడబడుచులుగా భావించి పసుపు, కుంకుమ, చీరను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు గ్రామ దేవతను దర్శించుకోగా ప్రముఖ రాజకీయ నాయకులు వివిధ గ్రామాల ప్రజలు తదితరులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
శ్రీ గోగులమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల జాతరలో చిక్కాల దొరబాబు…