Political

వారికి అధికారమధం ఎక్కువైంది…!!!

WhatsApp Image 2024-02-21 at 8.44.23 AM

అధికార వైకాపా పార్టీ గత 20 రోజులుగా సిద్ధం పేరుతో రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రజలకు సోషల్ మీడియా ద్వారా సంకేతాలు పంపించడం చూస్తుంటే అధికార పార్టీ అధికార మదంతో కన్ను మిన్ను కానరావడం లేదని కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. సిద్ధార్థ నగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగెళ్ళ ఏడు నెలలు గడుస్తున్నా సమయంలో రాష్ట్రంలో ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అవినీతి అక్రమాలపై ప్రశ్నించే వారిని ఇబ్బందులు పెట్టడం, ఆరోగ్యకరమైన రాజకీయాన్ని అరాచకం వైపు మళ్ళించడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడడం అయిపోయిందని ఆయన తెలిపారు. నగరం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో ప్రజలు ప్రజల మాన మర్యాదలను గౌరవించేవారినే గెలిపిస్తారని ఆయన తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.