అవమానాలు…. అన్యాయాలు…. ఈసడింపులు…. ఛీత్కారాల నేపథ్యంలో మానసిక సంఘర్షణల నుండి పుట్టుకొచ్చిందే తెలుగు నవగర్జన రాజకీయ పార్టీ అని ఆపార్టీ వ్యవస్థాపక జాతీయ అద్యక్షుడు కాట్ర నాగబాబు పేర్కోన్నారు. కాకినాడ దంటు కళాక్షేత్రంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించిన అనంతరం తెలుగు నవగర్జన పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలతో కూడిన మ్యానీఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కాట్రు నాగబాబు మాట్లాడుతూ కులాల ప్రాతిపదికన కాకుండా సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొని పారదర్శక అజెండా తో అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా సాగుతుందన్నారు.
అష్టదిగ్భందనంతో… నవగర్జన…!!!

