భారత దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో విజయ పతాకంలో మరో సంచలనం సృష్టంచింది. ఈ సంస్థ ఇన్సాట్ త్రీడీఎస్ అనే మూడో తరం ఉపగ్రహాన్ని వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు చేసేందుకు వీలుగా విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీహరికోటలో అంతరిక్ష కేంద్రం షార్ నుంచి చేపట్టారు. జీ.ఎస్.ఎల్.వీ. అంతరిక్ష వాహక నౌక ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. సముద్రాల ఉపరితలాలను, భూ ఉపరితల అధ్యయనం, పర్యవేక్షించేందుకు వీలుగా ఇస్రో ఈ మూడో తరం వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ త్రీడీఎస్ ను ప్రయోగించింది. ఇప్పటికే అంతరిక్షంలోకి ప్రయోగించిన ఇన్సాట్ త్రీడీ, ఇన్సాట్ త్రీడీఆర్ లతో కలిసి ఇది సేవలు అందించనుందని ఇస్రో సంస్ధం తెలియచేసింది.
మరో విజయాన్ని కైవసం చేసుకున్న ఇస్రో…

