Political

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లను పరిశీలించిన కలెక్టర్ కృత్తికా శుక్ల…

WhatsApp Image 2024-02-15 at 5.27.56 PM

కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం, అందలి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు పారదర్శకంగానూ, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల తెలిపారు. గురువారం రోడ్లు భవనాల శాఖ రెవెన్యూ అధికారుల సమన్వయంతో రూపొందించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లను భద్రపరిచే ఇనుప గెడంచీలను ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని పార్లమెంటరీ ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జరిగే పోలింగ్ ప్రక్రియ లో జిల్లాలో ఉన్న అన్ని ఈ.వీ.ఎం. యంత్రాలను స్థానిక జేఎన్టీయూ స్ట్రాంగ్ రూంలో భద్రపరచడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి సివిల్ వర్క్స్ నిర్వహిస్తున్నట్లు కూడా ఆమె తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిపించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యంత్రాంగాన్ని సంసిద్ధం చేస్తున్నామన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.