ఎన్నికల సంఘం విధులను బాధ్యతతో నిర్వహించాలని, ఇతర జిల్లాల నుంచి బదిలీపై వచ్చిన అధికారులందరూ గతంలో ఎన్నోసార్లు ఎన్నికల విధులు నిర్వహించినప్పటికీ ఎంత మాత్రం నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా స్పష్టం చేశారు. మంగళవారం అమలాపురంలో కలెక్టరేట్ సమావేశపు హాలు నందు 2024 సాధారణ ఎన్నికలు నియమావళిలో బాగంగా ఎన్నికల వ్యయం, ఎక్సైజ్, జీఎస్టీ, ఎం.సి.సి, ఎం.సి.ఎం.సి., తదితర 18 అంశాలకు సంబంధించి నియమించిన నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లోక్ సభ, శాసనసభ సాధారణ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై ఆయా నోడల్ అధికారులు పూర్తి అవగాహన కలిగివుండాలన్నారు. ఎన్నికల విధులు ఎంతో కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని జాగ్రత్తలతో సమర్థవంతంగా నిర్వ ర్తించాలన్నారు.
ఎన్నికల సంఘం విధులను బాధ్యతతో నిర్వహించాలి…

