ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ గాడ్ ఫాదర్ కే.వీ.పీ. రామచంద్ర రావును ఆంధ్ర రాష్ట్ర 93 బీ.సీ. కులాల ఐక్యవేదిక అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా బీ.సీ. లను అన్ని పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆంధ్ర రాష్ట్రంలో బీ.సీ. లను ఓటు బ్యాంకుగా వాడుకొని మోసం చేస్తున్న పార్టీలు వైయస్సార్ పార్టీ గాని, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ గాని బీ.సీ. లకు ప్రాధాన్యతనివ్వటం లేదని వారికి తెలిపారు.
ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో బీ.సీ. లను దగా చేస్తూ అగ్రకులాలకే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కేటాయించడం జరుగుతుందన్నారు. తుని నియోజకవర్గంలో కొప్పుల వెలమ ఓట్లు 50 వేలకు పైగా ఉన్నా… తుని నియోజకవర్గం లో కాకినాడ జిల్లా నుంచి ఒక్క సీటు కొప్పుల వెలమలకు కేటాయించాలేదని అన్నారు. కనుక ఏ పార్టీ అయినా కూడా కొప్పుల వెలమలకు, ఇతర బీ.సీ. కులాలు అత్యధిక శాతం ఉన్న నియోజకవర్గాలలో అసెంబ్లీ స్థానాలలో టిక్కెట్లు ఇవ్వాలని కోరారు.

