కాపవరం గ్రామానికి చెందిన మహిళలకు బలవంతంగా ఇళ్ళ పట్టాలను ఇచ్చి వేలిముద్రలు వేయించుకున్నారని. దీనిపై మహిళలు పట్టాలు ఇచ్చిన తర్వాత తలాలు చూపించమని ఎన్నిసార్లు అడిగినా స్థానిక ప్రజాప్రతినిధులు గాని, అధికార పార్టీ ఇంచార్జ్ దొరబాబు గాని పట్టించుకోకపోవడంతో మహిళలు ఆవేదనను జిల్లా కలెక్టర్కు విన్నవించుకోవాలనే ఉద్దేశంతో కాకినాడ తరలివచ్చారు. పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించకపోవడంతో ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేద మధ్యతరగతి ప్రజలు కష్టాలను పట్టించుకునే నాధుడే లేరని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం అధికార సమయం దగ్గర పడుతున్న పేదలకు ఇళ్ల స్థలాల చూపించక పోవడం వెనుక పేదలను మభ్యపెట్టి మోసం చేయడానికే ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.
పట్టాలిచ్చారుగానీ … స్థలాలు ఎక్కడండీ…!!

