శ్రీ సత్య సాయి జిల్లాలోని పెనుకొండ గ్రామం 44వ జాతీయ రహదారి ఆర్టీవో చెక్పోస్ట్ వద్ద గుర్తుతెలియని వాహనం చిరుత పులిని వేగంగా ఢీకొట్టి అక్కడినుంచి వెళ్లిపోయింది. దానితో పులికి తీవ్ర గాయాలు అయ్యాయి. అటు వెళ్తున్న వాహనదారులు చూసి చిరుత ప్రాణాలతో ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి ఫారెస్ట్ అధికారులు 6:30 గంటలకు చేరుకుని గాయాలతో లేవలేని స్థితిలో ఉన్న చిరుతను ఆటోలో చికిత్స నిమిత్తం జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటన తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది.
చిరుతను ఢీ కొట్టిన గుర్తుతెలియని వాహనం…???
