పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోడేరు వెళ్తున్న ఒక సర్వీస్ ఆటో ప్రమాదవశాత్తు బోల్తాపడడంతో ఆ ఆటోలో ఉన్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దానితో పాటు మరొక ఐదుగురు తీవ్రగాయాల పాలయ్యారు. అక్కడ స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆటోనుంచి మయట్లకు తీసి దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి కరలించారు. మృతి చెందిన వారు ముత్యాలపల్లికి చెందిన వాసుదేవ, నాగరాజుగా పోలీసులు తెలిపారు. వారందరూ తూర్పుపాలెంలో జరుగుతున్న ఆసరా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదానికి గురయినట్లు అధికారులు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం…
