డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం లో ఇన్చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం సహకారంతో రాయపురెడ్డి సురిబాబు (రాజా) కు రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. అన్ని మండల గ్రామాల్లో జనసేన కూటమితో వచ్చే సంకీర్ణంలో రాయపురెడ్డి సురిబాబు రాజా ను నియోజకవర్గం ప్రజలందరు కులమతాలకు అతీతంగా అభిమానించి బ్రహ్మరథం పడుతున్నారు . అయితే ఇన్చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం లేదా రాయపురెడ్డి సురిబాబు( రాజా) గెలుపు కు మహిళలు యువత ముక్తకంఠంతో కోరుతున్నారు.
ఇప్పటికే నియోజకవర్గం లో రాయపురెడ్డి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గ ప్రజల కు మరింత చేరువఅయ్యారు. త్వరలో ఆయనకు సీటు అధికారికంగా ప్రకటించిన వెంటనే అధికార పార్టీ నుండి పార్టీ మీద అభిమానంతో పార్టీ లో చేరాలనుకునే వారు టి.డి.పి. లో చేరేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో ఇక్కడ తెలుగు దేశం పార్టీకి మరింత బలం చేకూరనుంది. ఫలితంగా రామచంద్ర పురం నియోజక వర్గంలో జన సేన, తెలుగు దేశం మిత్రపక్షం ఉమ్మడి విజయం నల్లేరుమీద నడక కానుంది.

