క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జి.ఎం.సి. బాలయోగి స్టేడియం నందు జిల్లా స్థాయిలో ఆడదాo ఆంధ్రా టోర్నమెంట్ సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటన ద్వారా అధికారులకు సూచించారు. ఈ క్రీడల నిర్వహణ నిమిత్తం కొంత మంది అధికారులకు విధులు బాధ్యతలు కేటాయించడం జరిగిందన్నారు. జిల్లా స్థాయిలో క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు.
15 ఏళ్లు పైబడిన పురుషులు మరియు స్త్రీల కోసం విడి విడిగా ఐదు క్రీడాంశాలలో పోటీలు నిర్వహించాలన్నారు. క్రికెట్ ,వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, బ్యాడ్మింటన్ క్రీడా పోటీ లను ప్రభుత్వం తెలియజేసిన షెడ్యూల్ ప్రకారం జి.ఎం.సి. బాలయోగి స్టేడియంలో 5 రోజులపాటు జిల్లా స్థాయిలో ఆడుదాo ఆంధ్రా నిర్వహించాలన్నారు. జిల్లాస్థాయిలో జిఎంసి బాలయోగి స్టేడియం నందు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల ఓవరాల్ ఇన్చార్జిలుగా స్థానిక ఆర్డిఓ, జిల్లా చేనేత జౌళి శాఖ ఏడి ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారన్నారు.

