రాజకీయ అనుభవంతో కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడిగా ఏ.పీ. రాష్ట్రంలో గుర్తింపు పొందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గడచిన ఐదేళ్లుగా స్థబ్ధంగా ఉండటానికి కారణమేమిటని రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత తెలుగుదేశం పార్టీ పాలనలో తీవ్ర అలజడులు, ఆందోళనలు, పాదయాత్రలతో సంచనాలకు వేదికగా మారిన ముద్రగడ వై.ఎస్.ఆర్.సీ.పీ. అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి ఎందుకు మౌనంగా ఉన్నాడని గుసగులినిపిస్తున్నాయి.
కాపులకు 5 శాతం కాపు రిజర్వేషన్ను అమలు చేస్తానన్న మాజీ సీ.ఎం. నారా చంద్రబాబు నాయుడిని విభేదించడం… రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేసిన వై.ఎస్. జగన్ కి అనుకూలంగా వ్యవహరించడం వెనుక ఆంతర్యమేమిటి అర్ధంచేసుకోవచ్చు. వై.ఎస్.ఆర్.సీ.పీ. అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి ప్రశాంతంగా ఉన్న ముద్రగడ జనసేన పార్టీ తెరపైకి రావటంతో మరోసారి ఆగ్రహం వ్యక్తం చేయటం వెనుక ఖచ్చితంగా అధికార వై.ఎస్.ఆర్.సీ. పార్టీకి వత్తాసుగా ఉన్నరన్నది సుస్పష్టమవుతోంది.
ముద్రగడ ఆలోచనేమిటి…!!!

