ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘ ఆధ్వర్యంలో చలో రాజమండ్రి ఆర్జెడి కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా కాకినాడ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కాకినాడ కమిటీ సభ్యులు చలో రాజమండ్రి బయలుదేరారు.
ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ… మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్య మొండి వైఖరి మానుకోవాలన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, సంక్రాంతి పండుగలు మా పారిశుధ్య కార్మికులు జరుపుకునేలా, వారి కుటుంబాల్లో ఆనందం నింపేలా సమ్మె డిమాండ్స్ తక్షణమే పరిష్కరించి వారికి జీతాలు పెంచాలని ఆయన అన్నారు.

