కామ్రేడ్ కుడుపూడి సూర్యనారాయణ 21 వ వర్ధంతి కార్యాక్రమాన్ని సుందరయ్య భవన్ లో సీ.పీ.ఎం. నగర కన్వీనర్ పలివెల వీరబాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యాక్రమాన్నికి సీ.పీ.ఎం. జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, జిల్లా సీనియర్ నేత దువ్వ శేషబాజ్జీ లతో పాటు కె. సత్తిరాజు, జి. ప్రభాకర వర్మ లు విచ్చేసి ఆయనకు పూల మాలలతో నివాళ్లు అర్పించారు.
ఈ సందర్భంగా రాజశేఖర్, శేషబాన్జీ మాట్లాడుతూ… విద్యార్థి దశనుంచే కష్టజీవుల ఉద్యమం లో మమేకం అయ్యారని తెలిపారు. నిరంతరం ప్రజా సేవకుడు కుడుపూడి అని అన్నారు. కాకినాడ పట్టణం సీ.పీ.ఎం. కమిటీ సభ్యుడు గా విశేషమైన సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో సిపీఎం నగర కమిటీ సభ్యులు మలక వెంకట రమణ, తదితరులు పాల్గొన్నారు

