అంగన్వాడీ సిబ్బంది డిమెండ్ నెరవేర్చాలని చేస్తున్న సమ్మె విరమించుకోవాలని గర్భిణులకు నెలవారీ షెడ్యూల్ ప్రకారం సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ చేయాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో గర్భిణులకు కిట్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. బొబ్బిలిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎస్. అప్పలనాయుడు, ఎంపీ చంద్రశేఖర్తో కలిసి బొత్స ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా బొత్స మీడియాతో మాట్లాడుతూ… అంగన్వాడీ సిబ్బంది 11 డిమాండ్లలో 10 డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందన్నారు. అంగన్వాడీ సిబ్బంది జీతాల పెంపునకు సంబంధించిన 11వ డిమాండ్ను అంగీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, 2024 ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకున్న తర్వాత ఆ డిమాండ్పై నిర్ణయం తీసుకుంటామని ఆయన వెళ్లడించారు.
అంగన్వాడీ సిబ్బంది సమ్మె విరమించకోవాలి… -మంత్రి విజ్ఞప్తి-
