2024 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అలాగే కాకినాడ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అఖండ మెజార్టీ సాధించాలని కోరుకుంటూ స్థానిక 19 వార్డుకు చెందిన శ్రీనివాస్ గౌడ్ తన మిత్రులతో కలసి కాకినాడ నుండి కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధికి పాదయాత్రగా పయనం అయ్యారు. ఈ పాదయాత్రను వెంకటనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సిటీ ఎమ్మేల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రారంభించి శ్రీనివాస్ గౌడ్ కోరికను వాడపల్లి వేంకటేశ్వరుడు నెరవేర్చాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, జగనన్న గృహసారదులు , కన్వీనర్లు కమిటీ కన్వీనర్ సుంకర విద్యాసాగర్, మాజీ కార్పొరేటర్ కంపర బాబీ, జగన్నాథన్ విజయ్ కుమార్, పసుపులేటి వెంకటలక్ష్మి, తదితురులున్నారు.

