పార్ట్ టైం పొలిటిషన్ ముత్తా శశిధర్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై చేసిన ఆరోపణలు ద్వారా తమ ఉనికిని కాపాడుకోవడం కోసం చేస్తున్న తపన తప్ప ఆరోపణల్లో వాస్తవాలు లేవని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి పేర్కొన్నారు. సోమవారం వైకాపా సిటీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దొంగల పడ్డ ఆరు నెలలకు కుక్కలు మెరుగాయన్న చందంగా ముత్తా శశిధర్ తీరు ఉందన్నారు. గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు నిజం కాదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అప్పట్లోనే నిరూపించుకున్నారని తిరిగి అదే ఆరోపణలను మళ్లీ మళ్లీ చేయడం వెనక ముత్తా శశిధర్ కు రాజకీయాలకు పట్ల ఉన్న అవగాహన రహిత్యం బయటపడుతుందన్నారు.
దొంగలు పడ్డ ఆరు నెలలకు…!!!

