కాపులను ఆదరించి అందలమెక్కించిన ఘనత కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దేనని జగనన్న గృహ సారథులు, కన్వీనర్ల కమిటీ, కన్వీనర్ సుంకర విద్యాసాగర్ పేర్కొన్నారు. శనివారం వైకాపా సిటీ కేంద్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ నగరంలో కాపుల అభివృద్ధికి సంక్షేమానికి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అందిస్తున్న సంపూర్ణ సహకారం మరువలేనిది అన్నారు. రాజకీయ ఆర్థిక సాంఘిక సామాజిక అంశాలలో కాపు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత కల్పించి కాపు జాతి ప్రతిష్టను కీర్తిని నిలబెట్టిన ఘనత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిదే అన్నారు.
కాపులను అందలమెక్కించారు…!

