అంగన్వాడి కార్యకర్తల సమస్యల నివారణ పై మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తదితరులు అంగన్వాడీ సంఘాలు AITUC, CITU, IFTU నాయకులతో స్థానిక సచివాలయంలో చర్చలు నిర్వహించారు. సుమారు రెండున్నర గంటల వరకు అంగన్వాడి కార్యకర్తల సమస్యల పై చర్చలు జరిపారు. అంగన్వాడి కార్యకర్తల వేతనాలు, గ్రాట్యుటీ గురించి చర్చల్లో నాయకులకు ప్రస్తుతానికి ఏటువంటి హామీ ఇవ్వలేదు. ఈ చర్చల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, మహిళా సంక్షేమ ముఖ్య కార్యదర్శి పాల్గొన్నారు.
అంగన్వాడి కార్యకర్తలతో బొత్స సత్యనారాయణ భేటీ…

