పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వై.సీ.పీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ లోకు చేరారు. సామర్లకోట మండలంలో వెంకటకృష్ణరాయపురంకు చెందిన గొల్లపల్లి సర్వేశ్వరరావు, కుర్ర నారాయణస్వామి ఆధ్వర్యంలో వై.సీ.పీ. కన్వీనర్ వీరభక్తుల కొండబాబు, వీరభద్ర రాజు, మామిడి కొండ ఆధ్వర్యంలో దాదాపు 50 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరినట్లు తెలిపారు. టీ.డీ.పీ. ఎమ్మెల్యే చినరాజప్ప పార్టీ కండువాలతో వారికి స్వాగతం పలికి కండువాలను వేశారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో టీ.డీ.పీ. విజయం సాదించడానికి కృషి చేయాలని వారిని కోరారు.
వై.సీ.పీ. కి మరో షాక్….

