భారతదేశంలో 237 కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. అయితే క్రియాశీల కేసులు 1,185 కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణాల సంఖ్య 5,33,309గా నమోదైంది తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4.50 కోట్లు ఉంటే వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,44,69,336కి పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. కేసు మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వబడ్డాయి.
భారతదేశంలో కొత్తగా 237 కోవిడ్ కేసులు…

