రాష్ట్ర బాస్కెట్ బాల్ జట్టుకు సామర్లకోట ప్రగతి స్కూల్ చెందిన సీ.హెచ్. కిరణ్ రాజ్ ఎంపికయ్యాడని ప్రగతివిద్యాసంస్థల చైర్మన్ నూతలపాటి పూర్ణచంద్రరావు, నూతలపాటి హిమబిందులు చెప్పారు. చిత్తూరుజిల్లా మదనపల్లిలో ఇటీవల జరిగిన అండర్ 14 విభాగంలో స్కూల్ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ పోటీలలో జిల్లా జట్టు విజయం సాధించడంలో కిరణ్ రాజ్ అత్యద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడన్నారు. కిరణ్ రాజ్ ను అభినందించారు.
రాష్ట్ర బాస్కెట్ బాల్ జట్టుకు కిరణ్ రాజ్ ఎంపిక…