కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో సూర్య నగర్ నందు గ్రామ సచివాలయం మరియు వాటర్ ట్యాంక్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రారంభించారు . ఆ గ్రామానికి విచ్చేసిన సందర్భంగా మాజీ ఎంపీటీసీ పితాని వెంకట రాము శ్రీమతి ధనలక్ష్మి దంపతులు కన్నబాబుకు శ్రీనివాస పట్టాభిషేకం చిత్రపటాన్ని బహుకరించారు. సూర్య నగరకు గ్రామపంచాయతీ సుమారు మూడు కిలోమీటర్ల పైబడి ఉండేదని, నేడు జగనన్న ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలకి అందుబాటులోకి గ్రామ సచివాలయాలు తీసుకురావడం ఎంతో మంచిదని అలాగే ఈ ప్రాంతంలో ప్రజలు మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడే వారిని ఈ వాటర్ ట్యాంక్ వల్ల నీటి సమస్య తీరుతుందని ప్రజల సమస్యలు తెలుసుకుని అందుబాటులోకి సచివాలయం మరియు వాటర్ ట్యాంక్ ప్రారంభించిన కన్నబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
తూరంగిలో వాటర్ ట్యాంకర్ ప్రారంభించిన … ఎమ్మెల్యే కన్నబాబు

