కేరళలో తీవ్రమైన కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలోని శాస్త్ర సాంకేతిక సంస్థలు తమ అభిప్రాయాలను, అధ్యయనాలను పంచుకోకుండా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఎస్.డీ.ఎం.ఏ. నోటీసులను జారీ చేసింది. అయితే ఈ వివాదాస్పద నోట్ను ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి. వేణును ఆదేశించారు. వైయనాడ్లోని విపత్తు ప్రభావిత మెప్పాడి పంచాయతీని సందర్శించవద్దని, తమ అభిప్రాయాలు చెప్పవద్దని శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలను ఎస్.డి.ఎం.ఎ. ఆదేశించినట్లు వస్తున్న వార్తలు తప్పుదారి పట్టిస్తున్నాయని సీ.ఎం. గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ నోటీస్ పై విజయన్ ఆగ్రహం..

