బలూచిస్థాన్ ప్రావిన్స్లో ఆందోళనకారులు సైనిక సిబ్బందిపై దాడి చేయడంతో ఒక పాకిస్తానీ సైనికుడు మరణించాడు. అంతేకాకుండా ఒక అధికారితో సహా మరో 16 మంది గాయపడ్డారు. ర్యాలీ జరుగుతున్న గ్వాదర్ జిల్లాలో భద్రతా విధుల కోసం మోహరించిన భద్రతా దళాల సిబ్బందిపై బలూచ్ రాజీ ముచి బలూచ్ నేషనల్ గాదరింగ్ అని పిలవబడే ఒక హింసాత్మక గుంపు దాడి చేయడంతో ఈ సంఘటన జరిగింది. మరణించిన సైనికుడిని ప్రావిన్స్లోని సిబి జిల్లాకు చెందిన 30 ఏళ్ల సిపాయిగా గుర్తించారు. అంతేకాకుండా హింసాత్మక నిరసనకారులు చేసిన అనాలోచిత దాడుల ఫలితంగా ఒక అధికారితో సహా 16 మంది సైనికులు గాయపడ్డారని సైన్యం తెలిపింది.
బలూచిస్థాన్ ప్రావిన్స్లో సైనిక సిబ్బందిపై దాడి… ఒకరు మృతి…

