ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లోని కోచింగ్ సెంటర్లోని బేస్మెంట్లో వరదలు పోటెత్తడంతో ముగ్గురు సివిల్ సర్వెంట్లు మరణించారని అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావ్ ఐ.ఏ.ఎస్. స్టడీ సెంటర్ వద్ద నీటి ఎద్దడి గురించి ఢిల్లీ అగ్నిమాపక విభాగానికి కాల్ వచ్చింది. ఆ తర్వాత వారు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. విద్యార్థుల మృతిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో ఒక విద్యార్థిని మృతదేహాన్ని సైట్ నుండి వెలికి తీశారు. కొన్ని గంటల తర్వాత మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి.
ఢిల్లీలో ఘోర విషాదం… కోచింగ్ సెంటర్లో ముగ్గురు మృతి…
