ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతులకు కనీస మద్దతు ధర ఎం.ఎస్.పీ. కోసం చట్టపరమైన హామీని నిర్ధారించే అంశంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని విమర్శించారు. రైతు సమస్యలను విన్నవించేందుకు రాహుల్ గాంధీ బుధవారం రైతు నేతలను కలిసిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఎం.ఎస్. స్వామినాథన్ నివేదిక సిఫార్సుల మేరకు ఎం.ఎస్.పి. ని అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని టైమ్స్ నౌ యొక్క గ్రూప్-ఎడిటర్-ఇన్-చీఫ్ నవికా కుమార్తో ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె అన్నారు.
రాహుల్ గాంధీ పై విరుచుకుపడ్డ నిర్మలా సీతారామన్…

