తీహార్ జైలులో భారత రాష్ట్ర సమితి బీ.ఆర్.ఎస్. నాయకురాలు కే. కవిత ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని డీ.డీ.యూ. ఆస్పత్రికి తరలించారు. ఆమె తీవ్ర జ్వరంతో బాధపడుతోందని అధికారులు తెలిపారు. ఢిల్లీ మద్యం ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో కవిత తీహార్ జైలులో ఉండటం గమనార్హం. ఈ కేసుకు సంబంధించి మార్చి 15న బీ.ఆర్.ఎస్. నేతను ఈ.డీ. అరెస్టు చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 11న ఈ.డీ. కస్టడీలో ఉన్న ఆమెను సీ.బీ.ఐ. అరెస్టు చేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ కేసులో కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.ఈ నెల ప్రారంభంలో ఈ.డీ. కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు జూలై 25 వరకు పొడిగించింది. కాగా సీ.బీ.ఐ. లో ఆమె జ్యుడీషియల్ కస్టడీ జూలై 18తో ముగియనుంది. ఆప్ ప్రభుత్వ హయాంలో దేశ రాజధానిలో ఎక్సైజ్ పాలసీని సవరించేటప్పుడు అక్రమాలు జరిగాయని, లైసెన్స్ హోల్డర్లకు అనుచితమైన ఆదరణ లభించిందని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.
