జిరిబామ్ జిల్లాలో భద్రతా బలగాలు మరియు అనుమానిత కుకీ-జో ఉగ్రవాదుల మధ్య జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో ACRPF జవాన్ మరణించగా, మరో ఇద్దరు మణిపూర్ పోలీసు సిబ్బంది గాయపడ్డారు. జిరిబామ్ పోలీస్ స్టేషన్కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోంగ్బంగ్లో ఉదయం 9.30 గంటలకు ఈ సంఘటన జరిగిందని పోలీసు వర్గాలు తెలిపాయి.
శనివారం రాత్రి ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిగిన తర్వాత కేంద్ర, రాష్ట్ర బలగాల సంయుక్త బృందం ఆదివారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఆ బృందంపై మళ్లీ సాయుధ దుండగులు దాడి చేశారు. మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ను బీహార్కు చెందిన అజయ్ కుమార్ ఝా (43)గా గుర్తించారు. గాయపడిన ఇద్దరు పోలీసులను ఆస్పత్రికి తరలించారు.
