పేపర్ లీక్ రాకెట్, ఎడ్యుకేషన్ మాఫియా ముందు ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిగా నిస్సహాయంగా ఉన్నారని, నీట్-పీజీ 2024 పరీక్ష వాయిదా వేయడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం కేంద్ర ప్రభుత్వంపై దాడి చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు బీ.జే.పీ. ప్రభుత్వం పెనుముప్పు అని ఆయన అన్నారు.
ఇప్పుడు నీట్ పీజీ కూడా వాయిదా! నరేంద్ర మోదీ పాలనలో విద్యావ్యవస్థ ధ్వంసమైందనడానికి ఇది మరో దురదృష్టకర ఉదాహరణ’ అని రాహుల్ గాంధీ ఎక్స్లో ఒక పోస్ట్ లో తేలిపారు. కేంద్రంలోని బీ.జే.పీ. నేతృత్వంలోని ప్రభుత్వం అసమర్థత అని మండిపడ్డారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం జరగాల్సిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసింది. పరీక్షల తాజా తేదీని త్వరలో ప్రకటిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది.
కొన్ని పోటీ పరీక్షల సమగ్రతకు సంబంధించి ఇటీవల వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించిన నీట్-పీజీ ప్రవేశ పరీక్ష ప్రక్రియల పటిష్టతను క్షుణ్ణంగా అంచనా వేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

