మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ చిలిమాతో పాటు మరో తొమ్మిది మంది ప్రయాణిస్తున్న విమానం సోమవారం నిర్ణీత సమయానికి ల్యాండ్ కాకుండా అదృశ్యమైంది. అధ్యక్ష కార్యాలయం, క్యాబినెట్ విడుదల చేసిన ప్రకటనలో చిలిమా, ఇతర ప్రయాణీకులు లిలాంగ్వే నుండి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:17కి బయలుదేరిన మలావి డిఫెన్స్ ఫోర్స్ ఎయిర్క్రాఫ్ట్లో ఉన్నారని ఒక నివేదిక పేర్కొంది.
అధికారుల సమాచారం ప్రకారం… విమానం లిలాంగ్వేకు ఉత్తరాన సుమారు 380 కిమీ దూరంలో ఉన్న Mzuzu అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కానుంది. రాడార్కు దూరంగా ఉన్నప్పటి నుంచి విమానంతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి విమానయాన అధికారులు అన్ని ప్రయత్నాలూ చేశారని రాష్ట్రపతి ప్రకటన తెలియజేసింది.

